తెలుగు బుల్లితెరపై ఎంతోమంది హీరొయిన్లు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న విషయం తెలిసిందే..సీరియల్స్ ద్వారా తమకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకోవడమే కాదు వారికంటూ ఒక ఉన్నతమైన గుర్తింపును కూడా అందుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ అవుతున్న విషయం తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లే ఇక్కడ చలామణి అవుతున్నారు. వారిలో కూడా కొంతమంది హీరోయిన్లను నిర్మాతల మండలి వాళ్ళు బ్యాన్ చేసి శాశ్వతంగా తెలుగు సీరియల్స్ లో నటించకూడదు అన్న షరతులు కూడా విధిస్తున్న విషయం తెలిసిందే..


ఇకపోతే అలా తెలుగు బుల్లితెర సీరియల్స్ నుంచి బ్యాన్ చేయబడ్డ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. బుల్లితెరపై పసుపు కుంకుమ సీరియల్ ద్వారా బుల్లితెర హీరోయిన్గా పరిచయమై మంచి పేరు దక్కించుకుంది పల్లవి గౌడ. ఈ సీరియల్ మంచి హిట్ అవడంతో సావిత్రి సీరియల్ లో కూడా ఈమెకు అవకాశం లభించింది. సావిత్రి సీరియల్ వాళ్ళు సరిగ్గా ఈమెకు పేమెంట్ చేయకపోవడం వల్ల పల్లవికి వేరే సీరియల్ లో అవకాశం రావడంతో నటిస్తానని ఒప్పుకుంది.. కానీ సావిత్రి సీరియల్ వాళ్లకు తమ సీరియల్ పూర్తయ్యే వరకు వేరే సీరియల్ లో నటించనని అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అందుకే వారు కంప్లైంట్ చేయడంతో ఆమెను సీరియల్స్ నుంచి బ్యాన్ చేశారు.

అలాగే ప్రముఖ బుల్లితెర హీరోయిన్ వైష్ణవి ని కూడా సీరియల్స్ నుంచి తీసేశారు. వైష్ణవి కూడా దేవత సీరియల్ ముగిసే వరకు వేరే సీరియల్స్ లోను,  యాడ్స్ లోను చేయనని అగ్రిమెంట్ చేసిందట. కానీ ఏదో ఒక యాడ్ లో కనిపించేసరికి ఆమెను సీరియల్ నుంచే కాదు ఏకంగా బుల్లితెర ఇండస్ట్రీ నుంచే బ్యాన్ చేశారు. అయితే వైష్ణవి మాత్రం తనను ఎవరు సీరియల్స్ నుంచి తీసేయలేదని తనకు తానే వైదొలిగానని చెప్పుకొచ్చింది
 ఇకపోతే ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: