మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్  అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్ తన జట్టులోకి కొంతమంది కొత్త ఆటగాళ్లను తీసుకున్న విషయం తెలిసిందే. హరి శంకర్ రెడ్డి కూడా ఒకరు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఈ పేరు మారింది. కడప జిల్లాకు చెందిన ఈ యువ ఆటగాడిని ఐపీఎల్ లో  నెంబర్ వన్  గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ వేలం పాటలో దక్కించుకుంది. రూ. 20 లక్షలకు ఇతనిని కొనుగోలు చేసింది. అంతే కాకుండా ఈ వేలం పాటలో పాల్గొన్న క్రీడాకారులు రెండు  తెలుగు రాష్ట్రాల నుంచి వేలంపాటలో హరిశంకర్ రెడ్డి అమ్ముడుకావడం విశేషం. దీంతో హరీష్ శంకర్ రెడ్డి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ ఆటగాడు  రైతు పేరును నిలబెట్టాలి.


రాయచోటి నియోజకవర్గం, చిన్నమండెం మండలం, బోనమల పంచాయితీ, నాగూరువాండ్ల పల్లెకు చెందిన మారంరెడ్డి హరి శంకర్ రెడ్డి ఎనిమిదేళ్ల నుంచి తన ప్రతిభకు పదును పెట్టాడు. 2016 లో అండర్ 19  కి ఎంపికయిన ఈ యువ ప్లేయర్, 2018లో రంజీలో అడుగుపెట్టాడు. 22 ఏళ్ల హరి శంకర్ రెడ్డి కుడిచేతివాటం మీడియం పేస్ బౌలర్. పదునైన బౌలింగ్, స్వింగ్,ఖచ్చితమైన పేస్ బౌలింగ్ తో అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు.


రంజీ జట్టులో కూడా అతను తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా ఎంతో గొప్ప ఆటగాడైనా మహేంద్రసింగ్ ధోని, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా,దీపక్ చాహర్, ఫాప్ డుప్లెసిస్, శార్థుల్ ఠాకూర్ వంటి అగ్ర ఆటగాళ్లతో అతను డ్రెస్సింగ్ రూమ్ కూడా పెంచుకున్నాడు. ఎప్పటికైనా ఇండియా క్రికెట్ టీం లోకి అడుగు పెట్టాలని తన కోరికను అంచెలంచెలుగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు హరి శంకర్ రెడ్డి. ఇక అలాంటి ఎన్నో కోరికలతో ఉన్న హరి శంకర్ రెడ్డి ని ఐపీఎల్లో సెలెక్ట్ చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

ధోనీ తో కలిసి ఒక ఫోటో దిగితే చాలా అనుకున్నా, కానీ అతని తో కలిసి ఆడే అవకాశం వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ధోనీ తో కలిసి ఆడడం అదృష్టంగా భావిస్తున్నానని తనను కొనుగోలు చేసిన చెన్నై కి ధన్యవాదాలు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: