ఒక వ్యక్తిని ప్రేమించాలా వద్దా అనే దానిపై నేటి రోజుల్లో యువతికి పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంది అని చెప్పాలి. అదే సమయంలో ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తి తో బంధాన్ని కొనసాగించాలా లేదా అనే దానిపై కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఇటీవలి ఈ కాలంలో మాత్రం ఇక యువతి బ్రేకప్ చెబితే ఎంతోమంది యువకులు ప్రేమోన్మాదులు గా మారిపోయి దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాకుండా యువతి మీద కక్ష తీర్చుకోవడానికి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.


 ఇక్కడ ఓ యువకుడు ఇలాంటిదే చేశాడు. తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి జరుగుతుంది అని ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను కాదని ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. దీంతో కాసేపటి వరకు పెళ్లి మండపంలో ఉన్న వారందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మాస్క్ పెట్టుకొని వచ్చి పెళ్లికూతురు నుదుట కుంకుమ పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు.



 సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం యువతి నుదుట యువకుడు బొట్టు పెట్టాడు అంటే చాలు అది వివాహం తో సమానం గా భావిస్తూ ఉంటారు పెద్దలు. ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు ఇక్కడ ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రేయసి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో ఇక ఆ యువతిని దక్కించుకోవాలని భావించాడు. మాస్క్ వేసుకొని పెళ్లి పీటలు పైకి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అందరు చూస్తుండగానే ఆ వ్యక్తి తన మాజీ ప్రియురాలి నుదుటిపై కుంకుమను పెట్టాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. న్యాయం చేయాలంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: