ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్- 5 న ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిందే.. ఆ బాధితురాలు కాలిన గాయాలతో సహాయం కోసం కిలోమీటరకు పైగా నడిచినట్లు సింధుపూర్ గ్రామస్థులు తెలిపారు. కిలోమీటరు దూరం కాలిన గాయాలతో నడిచి వెళ్లిన బాధితురాలు ఓ ఇంటి బయట పనిచేస్తున్న ఓ వ్యక్తి సాయం తీసుకుందని గ్రామస్థులు తెలిపారు.

 

బాధితురాలు స్వయంగా 112కి ఫోన్ చేసి పోలీసులకు ఘటన గురించి సమాచారమిచ్చిందని తెలిపారు. బాధితురాలు ఫోన్ చేసిన తర్వాతనే పీఆర్వీ, అంబులెన్స్ వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బాధితురాలు మెజిస్ట్రేట్ కి కూడా తన వాంగ్మూలం ఇచ్చింది. ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారని బాధితురాలు స్టేట్మెంట్ లో తెలిపింది. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అదే రోజు సాయంత్రం కాలిన గాయాలతో ఉన్న యువతిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం లక్నో నుంచి విమానంలో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. 

 

అయితే యువతి శరీరం 90శాతం కాలిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. బాధితురాలి కోసం ప్రత్యేక ఐసీయుని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ యువతి లక్నోలోని ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

 

కొన్ని నెలల క్రితం.. ఉన్నావోలో నివాసం ఉండే యువతిపై అత్యాచారం జరిగింది. తర్వాత బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే ఆ నిందితుడు బెయిల్‌ పై విడుదలయ్యాడు. ఫిర్యాదు చేసిన యువతి పై కక్ష పెంచుకున్నాడు. ఈ సమయంలో ఇవాళ స్థానిక కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో బీహార్ పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వచ్చే సింధుపూర్ అనే గ్రామంలో యువతి పై ఒక్కసారిగా నిందితుడు, అతని నలుగురు స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: