ఎప్పటికప్పుడు సంచలన కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోయే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మరో ప్రాజెక్ట్ కి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించాడు. జనగణమణ అనే టైటిల్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నా అని ఆయన ప్రకటించారు. ఇది నా డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఆయన నుంచి ఒక ప్రకటన వచ్చింది. 

 

అయితే ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, కథ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం తెలియలేదు. కరణ్ జోహార్ తో కలిసి పూరి ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్... విజయ్ దేవరకొండ హీరో గా ఫైటర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: