జమ్ముకశ్మీర్‌లోని కథువా, పుంఛ్​ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. వివిధ సెక్టారుల్లో గ్రామాలే లక్ష్యంగా మోర్టార్​ షెల్స్​తో దాడులకు తెగబడింది.పాక్​ చర్యకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం.. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని తెలిపింది. కథువా జిల్లా హీరానగర్​ సెక్టార్​లోని మనీహారి, చంద్వా, లోండి గ్రామాల్లో శివాలయం సహా కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.


కొన్నిపశువులకు బుల్లెట్​ గాయాలవగా.. వాటికి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి 9.45 గంటల నుంచి.. ఉదయం 5.25 వరకు పాక్​ బలగాలు దాడులు కొనసాగించినట్లు అధికారులు చెప్పారు.పుంఛ్​ జిల్లాలోనూ కస్బా, కిడని, షాపూర్​ సెక్టార్లలో పాక్​ సైన్యం మోర్టార్​ షెల్స్​ను ప్రయోగించిందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: