ఆంధ్రప్రదేశ్ లో వరుస దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి, గుంటూరు జిల్లాలో మహిళపై ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. మేడి కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళపై నిన్న రాత్రి పాలడుగు అడ్డరోడ్డు వద్ద గ్యాంగ్ రేప్ దుర్ఘటన చోటు చేసుకుంది, బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డుకుని భర్తను కొట్టి మహిళను పొలాల్లోకి లాక్కెళ్లిన దుండగులు అత్యాచారం చేశారని అంటున్నారు, అయితే నిన్న రాత్రి సత్తెనపల్లి పోలీస్స్టేషన్లో దంపతుల ఫిర్యాదు చేశారు, అయితే అది తమ పరిధి కాదని సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకో లేదని సమాచారం, చివరికి పోలీసులు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది, మరి పోలీసులు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని అంటున్నారు. చూడాల్సి ఉంది ఏం జరగబోతోంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: