రాహుల్ గాంధీ.. దేశంలోనే ఓ ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన నాయకుడు. దేశాన్ని వందేళ్లకు పైగా ఏలిన పార్టీ నాయకుడు.. ఆయన కుటుంబానికి ఓ చరిత్ర ఉంది.. చరిష్మా ఉంది. అయినా ఆయన రాజకీయాల్లో ఆశించినంతగా రాణించలేకపోతున్నారు. ఇక మోడీ ఇప్పటికే రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చి.. మరోసారి గెలిచేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ విచారణ అంశం కాంగ్రెస్‌ కు కలసి వచ్చేలా ఉంది.

ఇవాళ  రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించబోతోంది. గాంధీ కుటుంబాన్ని అనవసరంగా వేధిస్తున్నారన్న ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఇది రాహుల్ గాంధీకి సానుభూతిగా మారే అవకాశం ఉంది. ఈ ఈడీ కేసులో రాహుల్‌ ను ఎంత ఇబ్బంది పెడితే అది అంతగా సానుభూతిగా మారొచ్చని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: