ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. టీడీపీ సహా ఎల్లో మీడియా తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రులకు కేబినెట్ మీటింగ్‌లో సూచించారు. కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ కీలక కామెంట్లు చేసినట్టు తెలిసింది. ప్రతిపక్షాల అబద్ధాలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాలని సీఎం జగన్ మంత్రులను ఆదేశించినట్టు తెలిసింది.


ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీడీపీ.. ఈ నలుగురు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ అన్నట్టు తెలుస్తోంది. ఇకపై ఈ నలుగురు చేసే దుష్ప్రచారంపై ప్రతి అంశంపై మంత్రులు స్పందించాలని జగన్ వార్నింగ్ ఇచ్చారు. చివరకు కుటుంబ సభ్యులపైనా అనవసర విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహించినట్టు తెలిసింది. ఇంకా ఆ నలుగురి ఆరోపణలను ఉపేక్షించడానికి వీల్లేదని.. మంత్రులు ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలని జగన్ గట్టిగానే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: