ఇక పాలను తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం మన శరీర ఆరోగ్యాన్నే కాదు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా పాలు చాలా బాగా సహాయపడతాయి. పాలతో ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఇంకా మృతకణాలు తొలగించవచ్చు. అలాగే ముఖంపై ఉండే నలుపు కూడా తొలగిపోయి ముఖం అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. అయితే పాలను ఏ విధంగా ఉపయోగించడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచోకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ టమాట రసం వేసి కలపాలి. ఇంకా ఆ తరువాత ఇందులో ఫేస్‌ ప్యాక్ కు సరిపడా పచ్చి పాలను పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖాన్ని నీటితో బాగా శుభ్రంగా కడగాలి. తరువాత నిమ్మచెక్కను పంచదారలో ముంచి పంచదారతో ముఖాన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి.


ఇలా స్క్రబ్ చేసుకున్న 5 నిమిషాల తరువాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.తరువాత ముందుగా తయారు చేసుకున్న ప్యాక్ ను ముఖానికి రాసుకుని సాఫ్ట్ గా మసాజ్ చేసుకోవాలి. ఇది ఆరిన తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా పాలతో చేసిన ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు ఈజీగా తొలగిపోతాయి.అలాగే ముఖంపై ఉండే జిడ్డు కూడా తొలగిపోయి ముఖం చాలా అందంగా ఇంకా అలాగే కాంతివంతంగా కూడా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు చాలా ఈజీగా తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. ఇంకా అలాగే చర్మానికి కావల్సిన పోషకాలు అంది చర్మ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను మన ముఖానికి వేసుకున్నప్పుడు ముఖాన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఖచ్చితంగా మన ముఖాన్ని చాలా అందంగా ఇంకా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: