సమ్మర్లో చర్మంపై ఎక్కువగా బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో దురద వంటి ఇన్పెక్షన్ లు వస్తూ ఉంటాయి.చర్మంపై చేరిన ఈ బ్యాక్టీరియాను, ఫంగస్ ను తొలగించడం కోసం వీలైనంత వరకు వేప నీటితో స్నానం చేయాలి. వేపాకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వేప నీటితో స్నానం చేయడంతో పాటు వేప నూనెను చర్మానికి రాసుకోవచ్చు. అలాగే వేప ఆకులను పేస్ట్ గా చేసి చర్మంపై కూడా రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్పెక్షన్ లు త్వరగా తగ్గుతాయి. అలాగే ఒక గిన్నెలో వంటసోడాను తీసుకుని అందులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దద్దుర్లు ఉన్న చోట చర్మంపై రాసుకోవాలి. కొంత సమయం తరువాత సాధారణ నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. రెండు నుండి మూడు రోజుల పాటు ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.చర్మ సమస్యలతో బాధపడే వారు ముల్తానీ మట్టిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనకు కావల్సినంత ముల్తానీ మట్టిని నీటిలో వేసి ఒక గంట పాటు నానబెట్టాలి.


తరువాత నీటిని తీసేసి ఇందులో చందనం పొడి వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అవసరాన్ని బట్టి శరీరంపై, ముఖంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి ఎంతో చల్లదనంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. చర్మంపై పేరుకుపోయిన ట్యాన్ తొలిగిపోతుంది. దద్దుర్లు, చెమటకాయలు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.వేసవిలో ఇలాంటి సమస్యలు రావడం సర్వసాధారణం. అయినప్పటికి వీటి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వేసవికాలంలో ఉండే ఉష్ణోగ్రత కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. దీనికి గాలిలో ఉండే బ్యాక్టీరియా చేరడంతో చర్మంపై దురద, దద్దుర్లు, చెమట కాయలు వంటివి తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది చల్లదనాన్ని ఇచ్చే పౌడర్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. వేసవికాలంలో ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాలను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. సమ్మర్లో ఈ చిట్కాలను పాటించడం వల్ల చర్మ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: