ఏపీలో అధికార వైసీపీ ఖాతాలో మ‌రో ప‌ద‌వి వ‌చ్చి చేరింది. ఆ పార్టీ నుంచి తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ విజ‌యం సాధించారు. శాసనసభ్యులో కోటాలో ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికతో జ‌గ‌న్ ఖాతాలో మ‌రో విజ‌యం వ‌చ్చిన‌ట్ల‌య్యింది. వాస్త‌వానికి నామినేష‌న్ల ప‌ర్వం ముగిసిన‌ప్పుడే డొక్కా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇక ఈ రోజు ఆయ‌న రిటర్నింగ్ అధికారి నుంచి ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

 

కాంగ్రెస్ నుంచి మంత్రిగా ఉన్న ఆయ‌న ఆ త‌ర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మొన్న ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి హోం మంత్రి సుచ‌రిత చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న ఎమ్మెల్సీ సీటులో వైసీపీ ఆయ‌న్నే పోటీ పెట్ట‌డంతో ఏక‌గ్రీవంగా గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: