తొలిసారి ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా వృత్తివిద్య, కొన్ని మైనర్ సబ్జెక్టులను ఆన్లైన్లో మూల్యాంకనం చేశారు. అక్టోబర్ 26 నుండి నవంబర్ 02 వరకు సమాధాన పత్రాల రీ వాల్యూవేషన్, పరిశీలనకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ఒక పేపర్కు రివాల్యూవేషన్కు రూ.260, అదేవిధంగా స్కాన్కాఫీ, పునఃపరిశీలనకు రూ.1300 చెల్లించాల్సి ఉందని ఓ ప్రకటనలో వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్ ఆన్సర్ షీట్ కూడ ఆన్లైన్లోనే లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 3,24,800 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 14,950 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం bie.ap.gov.in లేదా examsresults.ap.nic.in, results.apcfss.in వెబ్సైట్లో చెక్చేసుకోగలరు.
తొలిసారి ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా వృత్తివిద్య, కొన్ని మైనర్ సబ్జెక్టులను ఆన్లైన్లో మూల్యాంకనం చేశారు. అక్టోబర్ 26 నుండి నవంబర్ 02 వరకు సమాధాన పత్రాల రీ వాల్యూవేషన్, పరిశీలనకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ఒక పేపర్కు రివాల్యూవేషన్కు రూ.260, అదేవిధంగా స్కాన్కాఫీ, పునఃపరిశీలనకు రూ.1300 చెల్లించాల్సి ఉందని ఓ ప్రకటనలో వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్ ఆన్సర్ షీట్ కూడ ఆన్లైన్లోనే లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 3,24,800 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 14,950 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం bie.ap.gov.in లేదా examsresults.ap.nic.in, results.apcfss.in వెబ్సైట్లో చెక్చేసుకోగలరు.