ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు రాసిన విద్యార్థులు  రిజ‌ల్ట్స్ ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వారికి ఒక శుభావార్త చెప్పారు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రాలకు సంబంధించిన అడ్డాన్స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

తొలిసారి ఈ సంవ‌త్స‌రం ప్ర‌యోగాత్మ‌కంగా వృత్తివిద్య‌, కొన్ని మైన‌ర్ స‌బ్జెక్టుల‌ను ఆన్‌లైన్‌లో మూల్యాంక‌నం చేశారు. అక్టోబ‌ర్ 26 నుండి న‌వంబ‌ర్ 02 వ‌ర‌కు స‌మాధాన ప‌త్రాల రీ వాల్యూవేష‌న్, ప‌రిశీల‌న‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు వెల్ల‌డించారు. ఒక పేప‌ర్‌కు రివాల్యూవేష‌న్‌కు రూ.260, అదేవిధంగా స్కాన్‌కాఫీ, పునఃప‌రిశీల‌న‌కు రూ.1300 చెల్లించాల్సి ఉంద‌ని  ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. స్కానింగ్ ఆన్స‌ర్ షీట్ కూడ ఆన్‌లైన్‌లోనే ల‌భించ‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు 3,24,800 మంది, రెండో సంవ‌త్స‌రం విద్యార్థులు 14,950 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఫ‌లితాల కోసం bie.ap.gov.in లేదా examsresults.ap.nic.in, results.apcfss.in వెబ్‌సైట్‌లో చెక్‌చేసుకోగ‌ల‌రు.


మరింత సమాచారం తెలుసుకోండి: