వ‌డ్ల‌ను కొనాల‌ని కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్ నుంచి  బ‌షీరాబాగ్ వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం వ‌ర‌కు కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో డ‌ప్పు చ‌ప్పుళ్ల‌తో, ఆట‌, పాట‌ల‌తో క‌ర్ష‌కుడా.. క‌దిలిరా అనే పేరుతో మ‌హార్యాలీ నిర్వ‌హించారు.  ప్ర‌స్తుతం రైతులు పండించిన పంట‌ను కేంద్రం కొన‌లేమ‌ని చెప్ప‌డానికి కార‌ణం రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాలే అని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి  ఆరోపించారు. పండించిన వ‌రి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొనుగోలు చేసి రైతుల‌కు న్యాయం చేయాల‌ని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేసారు.

ర్యాలీలో భాగంగా రైతులతో క‌లిసి రేవంత్‌రెడ్డి, సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి ర్యాలీ చేశారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ క‌దం తొక్కింది. రైతుల కోసం చేసే పోరాటంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందంజ‌లో ఉంటుంద‌ని తెలిపారు నేత‌లు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దొంగ‌నాట‌కాలు ఆడుతున్నాయ‌ని మండిప‌డ్డారు కాంగ్రెస్ నేత‌లు. మ‌రోవైపు వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ విన‌తి ప్ర‌తం అందించేందుకు కేవ‌లం 10 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ముందు భారీ ఎత్తున పోలీసులు మోహ‌రించారు. అనుమ‌తి కేవ‌లం 10 మందికి మాత్ర‌మే ఉండ‌డంతో కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే పోలీసులు, కాంగ్రెస్ నేత‌లు వాగ్వాదానికి దిగారు. ఈ ధ‌ర్నాలో భ‌ట్టివిక్ర‌మార్క‌, ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, ఎమ్మెల్యేసీత‌క్క‌, సీనియ‌ర్ నాయ‌కులు త‌దిత‌రులు భారీ ర్యాలీకి హాజ‌ర‌య్యారు.
 








మరింత సమాచారం తెలుసుకోండి: