హైదరాబాద్‌లో ఐదు  రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌ పూర్తిగా నిండిపోయింది. భారీగా చేరుతున్న వరద నీరుతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కూకట్‌ పల్లి నాలా నుంచి  హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో  హుస్సేన్ సాగర్ లోకి పూర్తి స్థాయికి నీటి మట్టం  చేరుకుంది.  హుస్సేన్ సాగర్ ప్రస్తుత 513.41మీటర్లుగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.


హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం కూడా 513.41 మీటర్లే.. అంటే  హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిందన్నమాట.. ఇంకా జోరుగా  హుస్సేన్ సాగర్ కు ఇన్‌ఫ్లో వస్తోంది. అందుకే.. బయటి నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు సమానంగా తూముల  ద్వారా  బయటకు నీరు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో సాగర్ కాల్వల పరీవాహ ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నారు. నాలా ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరుచుకున్నవారిని అప్రమత్తం చేసి ఖాళీ చేయిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: