విశాఖ విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖలో 234 కోట్లతో అమృత్ మిషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ మిషన్ కింద 234 కోట్లతో మంజూరు చేసిన 8 ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తి అయ్యాయి. మిగిలిన ప్రాజెక్ట్‌ పనులు పురోగతిలో ఉన్నాయని పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ పార్లమెంటులో తెలిపారు. వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

కేంద్రం దేశవ్యాప్తంగా అమృత్ మిషన్ కింద ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నం ఒకటి. అందులో భాగంగా గ్రౌండింగ్ అయిన ప్రాజెక్టులకుగాను రూ.73.31 కోట్లతో చేపట్టిన 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మిగిలిన ప్రాజక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 217 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన మరికొన్ని పనులు పూర్తయ్యాయి. విశాఖలో తాగునీటి సరఫరాకు సంబంధించి 70.44 కోట్లతో చేపట్టిన రెండు ప్రాజెక్టులు, 2.87 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన రెండు పార్కుల నిర్మాణం పూర్తయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: