పెళ్లి జరుగుతుంది అంటే హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పెళ్లి మండపం మొత్తం బంధుమిత్రులందరి సందడితో కళకళలాడుతు ఉంటుంది. బాజా భజంత్రీల సవ్వడి నడుమ.. ఎంతో సంతోషంగా పెళ్లి తంతు  వీక్షించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. బంధుమిత్రులు అందరూ వచ్చేశారు ఇక ఇరు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వధూవరులు కూడా పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఇంకో గంటలో పెళ్లి జరగబోతుంది. కాని అంతలో అప్పటి వరకూ ఎంతో సందడిగా ఉన్నపెళ్లి వాతావరణం మొత్తం ఒక్కసారిగా మూగబోయింది.


 కారణం వరుడు కనిపించకుండా పోవడమే.. మరో గంటలో పెళ్లి బాజాలు మోగాల్సిన సమయంలో ఒక్కసారిగా మండపంలో వరుడు కనిపించకుండా పోవడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. దీంతో ఏం జరిగిందో తెలియక అందరూ అయోమయంలో పడిపోయారు. ఈ ఘటన సింగనమల మండలంలోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన యువకుడికి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం లోని గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. అన్ని లాంచనాలు మాట్లాడుకుని ఇక వివాహ తేదీని కూడా ఫిక్స్ చేశారు



 ఈ క్రమంలోనే ఇటీవల పదవ తేదీన బుధవారం 10 గంటల సమయంలో వివాహం జరగాల్సి వుంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వధువును తీసుకుని కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రికె వరుడి గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉదయం సమయంలో టిఫిన్ చేసి ఇక పెళ్లి కూతురుని రెడీ చేస్తున్నారు. సరిగ్గా మరో గంటలో పెళ్లి జరగబోతుంది అనుకుంటున్న సమయంలో చెప్పులు సరిగ్గా లేవు మార్చుకు వస్తాను అంటూ వెళ్ళాడు అయితే వివాహ సమయం దగ్గర పడుతున్న కూడా వరుడు మాత్రం రాలేదు. కుటుంబీకులు వెళ్లి గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి సాయంత్రానికి వరుడి ఆచూకీ కనుగొని గ్రామ పెద్దలు దగ్గరికి  తీసుకువచ్చారు కుటుంబ సభ్యులకు. ఈ వివాహం ఇష్టం లేదని అందుకేచెప్పకుండా పారి పోయాను అంటూ వరుడు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: