పెళ్లయిన ఆడవాళ్ళు జీవితాంతం ముత్తయిదు గా ఉండాలని కోరుకుంటారు.. పసుపు కుంకాలు చల్లగా  ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం చేజేతులారా ఏకంగా భర్తను దూరం చేసుకుంది. మెడలో ఉన్న తాళిబొట్టు ను  తన చేత్తోనే తెంచుకున్నంత పని చేసింది. ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చింది. ఇష్టం లేని పెళ్లి చేశారు అన్న కారణంతో ఏకంగా భర్త పైన పగ పెంచుకున్న భార్య  పక్కింటి కుర్రాడు సహాయంతో ఏకంగా భర్తను దారుణంగా హతమార్చింది. తనకు ఇష్టం లేకుండా ఆటో డ్రైవర్ కు ఇచ్చి పెళ్లి చేశారు అన్న విషయాన్ని అసలు సహించలేకపోయింది ఆ భార్య. అదే విషయాన్ని మనసులో పెట్టుకుని ఓ రోజు దారుణానికి పాల్పడింది.


 ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఊర్మిళ అనే మహిళ ను ఆటో డ్రైవర్ గా పని చేసే రాజ్కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తనకు పెళ్లి ఇష్టం లేదు అని ఎంత చెప్పినప్పటికీ పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. అయితే భర్తతో అయిష్టంగానే ఉండటం మొదలు పెట్టింది సదరు యువతి. ఇక కొన్ని రోజుల్లోనే భర్త భార్యను వేధించడం మొదలుపెట్టింది. ఇక ప్రతిరోజూ సూటిపోటి మాటలతో మానసికంగా కూడా వేధించేవాడు భర్త. ఈ క్రమంలోనే సదరు యువతి ఇంటి పక్కనే ఖాన్ అనే యువకుడితో వివాహం సంబంధానికి తెరలేపింది. ఆ తర్వాత భర్తను అంతమొందించాలి అని భావించింది.


 ఎలాగైనా భర్త ని చంపేయాలి అని ఇక ప్రియుడు ఖాన్ తో కలిసి ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఇక ఆమె ప్రియుడు ఖాన్ భర్త ఆటోని అద్దెకు తీసుకున్నాడు. మాంగోల్పూరి ఇండస్ట్రియల్ ఏరియా  లోకి వెళ్ళాలి అని చెప్పాడు. కిరాయి వస్తుందని ఆశతో ఆటో తీసుకొని వెళ్ళాడు రాజ్కుమార్. కొంత దూరం వెళ్ళిన తరువాత నిర్మానుష్య ప్రదేశంలో ఆపమని చెప్పాడు ఖాన్.  ఇక అంతలోనే తన దగ్గర ఉన్న తుపాకితో కాల్చి చంపేస్తాడు. ఇక కాల్పులు జరిపిన తర్వాత మరణించాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: