గతంలో మద్యం మత్తు లో ఓ యువకుడు ఏకం గా రోడ్డుపై వెళ్తున్న ఒక పామును పట్టుకుని ఇక విష పూరితమైన పాము అని కూడా ఆలోచించ కుండా.. ఆ పాముకు ముద్దు పెట్టిన ఘటన ఒకటి సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇక మరి కొంత మంది ఏకంగా మద్యం మత్తు లో పోలీసుల పై తిరగబడి మాట్లాడిన వీడియోలు కూడా ఎన్నో హాట్ టాపిక్ గా మారి పోయాయి. ఇప్పుడు మద్యం మత్తు లో ఒక వ్యక్తి మరింత విచిత్రం గా ప్రవర్తించాడు.
ఈ ఘటన హైదరాబాద్ నగరం లోని అంబర్పేటలో వెలుగు లోకి వచ్చింది. గాంధీ బొమ్మ సమీపం లోని కరెంట్ పోల్ ఎక్కి ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. గంటకు పైగా జనాలకు పోలీసులకు చుక్కలు చూపించాడు సదరు వ్యక్తి. అయితే ఫుల్లుగా మద్యం తాగి ఇక ఆ మత్తులోనే కరెంట్ పోల్ ఎక్కినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కిందకి దిగాలి అటు అతనికి ఎంత చెప్పినా ససేమిరా అన్నాడు. అక్కడ జనం భారీగా గుమిగూడటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎట్టకేలకుతల అతన్ని కిందికి రప్పించారు పోలీసులు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి