ఏంటో ఇటీవలికాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే పోలీసులకి కాదు అటు దొంగలకి కూడా బాగా తెలివి పెరిగి పోతుంది అని అనకుండా ఉండలేరు ఎవరైనా. ఎందుకంటే నా దారి రహదారి అనే రేంజ్లో రొటీన్ పద్ధతిలో కాకుండా కాస్త కొత్తగా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు టెక్నాలజీ ని బాగా ఉపయోగించుకుని పోలీసులకు దొరక్కుండా చోరీలు చేస్తున్న తెలివైన దొంగ లు కూడా నేటి రోజుల్లో ఎక్కువై పోతున్నారు కొంతమంది. మంచివారిలా పరిచయం పెంచుకుని ఆ తర్వాత అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నారు.



 దీంతో ఇటీవల కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక వ్యక్తి రొటీన్ దొంగ కాదు.. కాస్త డిఫరెంట్. అందరిలా కాదు.. మద్యం షాపు వద్ద అతడు దొంగతనం చేస్తూ ఉంటాడు. మద్యం షాపు వద్ద వ్యక్తులతో పరిచయం చేసుకుని.. ఫుల్లుగా మద్యం తాగించి చివరికి నగదును ఎత్తుకు వెళుతూ  ఉంటాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. వరంగల్కు చెందిన సందీప్ గత కొంతకాలంగా మైలారు దేవరపల్లి పరిధిలో లక్ష్మిగూడ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం చేస్తే నెలకు జీతం వస్తుంది. ఇక వ్యాపారం చేస్తే లాస్ వస్తుంది. ఈజీగా మనీ సంపాదించడం ఎలా అని ఆలోచించాడు.


 దీంతో ఒక కొత్త చెత్త ఆలోచన అతని మైండ్లో తట్టింది. ఈ క్రమంలోనే వైన్ షాప్ కళ్ళు కాంపౌండ్ వద్ద వ్యక్తులను పరిచయం చేసుకుంటాడు. వారితో కలిసి మద్యం సేవించి మాటల్లోకి దింపుతాడు. ఇక ఆ తరువాత మాటల్లో పెట్టి వారి వద్ద నుంచి నగదు సెల్ఫోన్ దొంగలించి పరార్ అవుతాడు. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీరామ్ కాలనీకి చెందిన నరసింహం కు మద్యం తాగించి అతని జేబులో ఉన్న ఏటీఎం కార్డు దొంగలించాడు. అకౌంట్ నుంచి సుమారు రెండు లక్షల 15 వేల రూపాయల దొంగలించాడు. ఈ క్రమంలోనే ఇక బాధితుడు నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చివరికి అతని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: