తాజాగా అలాంటి ఓ ఘటన జరిగింది. కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆముదార్లంక గ్రామం లో కట్టుకున్న భర్తను భార్య కిరాతకం గా చంపేసింది. పచ్చడి బండతో కొట్టి కిరాతకం గా భర్తను భార్య హత్య చేసిన ఘటన స్ధానికం గా కలకలం రేపుతోంది. భర్త కళ్లేపల్లి వెంకట సుబ్బారావు తనను పదే పదే అనుమానిస్తున్నాడని,ఆ కోపంతో చంపేసినట్లు భార్య ఒప్పుకుంది. గతంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, దీంతో ఏడు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిందని పోలీసులు వివరాలు వెల్లడించారు.
పెద్దల మధ్య పంచాయతీ జరిగి ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నం చేశారని, తర్వాత ఇటీవల భార్య మళ్లీ కాపురానికి వచ్చిందని పోలీసులు తెలిపారు. భార్యతో గ్రామస్తులు కాస్త సన్నిహితంగా మాట్లాడినా సుబ్బారావు అనుమానిస్తూ మందలిస్తూ ఉండేవాడు. గురువారం కూడా అలాగే మందలించగా.. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. మరింత ఆవేశానికి గురైన భార్య వీరకుమారి ఇంట్లో ఉన్న పచ్చడి బండతో భర్త తలపై గట్టిగా కొట్టింది.
ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మృతిని తల్లి నిర్మాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్య వీరకుమారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.