ఈ క్రమంలోనే మనిషి అవసరం లేకుండా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు మనిషి చేయాల్సిన అన్ని రకాల పనులను చేస్తూ ఉన్నాయి. ఇలా మనిషి జీవితంలో కామన్ గా మారిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులలో అటు రైస్ కుక్కర్ కూడా ఒకటి అన్న విషయం తెలుసు. ఏకంగా రైస్ కుక్కర్ ఉపయోగించి మనిషి అవసరం లేకుండానే ఇన్స్టంట్ గా ఆహారం వండుకుంటూ ఉన్నారు నేటి రోజుల్లో ఎంతోమంది. ఇలా ఇటీవల కాలంలో ఎవరు ఇళ్లల్లో చూసిన ఇలాంటి రైస్ కుక్కర్లు దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ గా మారిపోయిన రైస్ కుక్కర్ ఇక్కడ ఒక మహిళ ప్రాణం పోవడానికి కారణమైంది.
రైస్ కుక్కర్ ఏంటి ప్రాణాలు తీయడమేంటి రైస్ కుక్కర్ వాడటం వల్ల ఎక్కడైనా ప్రాణాలు పోతాయా అంటే ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతారు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బొగడ భూపతిపూర్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల శ్రావణి ఇటీవల విద్యుత్ షాక్ తో మృత్యువాత పడింది. అయితే ఏడవ తరగతి చదువుతున్న శ్రావణి స్కూలుకు వెళ్లేందుకు అన్నం వండాలని రైస్ కుక్కర్లో పెట్టింది. అయితే రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసే సమయంలో కరెంట్ షాక్కు గురైన శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది అని చెప్పాలి.