కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేబుల్ నెట్ ను దేశమంతా ఉచితంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దేశంలో పబ్లిక్ సెక్టార్లైన దూరదర్శన్ రేడియో లాంటి వాటి వినియోగాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2539 కోట్లు కేటాయించాలన్న నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తుంది. దీనికోసం సెంట్రల్ స్కీంకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం ఛానల్ కవరేజ్ ని 80 శాతం మంది జనాలకు విస్తరించాలని నిర్ణయించుకుంది.
8లక్షల ఉచిత డిటిహెచ్ లను సెట్టాప్ బాక్స్ లను కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మారుమూల ప్రాంతంలో నివసించే జనాలకు అంటే గిరిజన ప్రాంతానికి సంబంధించిన జనాలకు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో ఉన్నవారికి ప్రధానంగా వీటిని అందించాలని నిర్ణయించుకున్నారు. వీటిలో దూరదర్శన్ ఛానల్ తో సహా కొన్ని న్యూస్ చానల్స్ కొన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా వస్తాయి.
ఇప్పుడు డిటిహెచ్ ఎక్కువగా ప్రజాదరణ పొందింది కాబట్టి దేశమంతా ప్రజలందరికీ ఈ డిటిహెచ్ నీ ఉచితంగా ఇచ్చేయాలని ఈ విధంగా డిటిహెచ్ ను విస్తరించాలని కేంద్రం నిర్ణయించుకుంది. వీటితోపాటుగా పాత స్టూడియో, ఇంకా ఓపి పరికరాలను కూడా మార్చివేయడానికి తయారీ సేవలతో ఉపాధి కోసం ఉపయోగపడడానికి దూరదర్శన్ 28 ప్రాంతీయ చానల్స్ తో కలుపుకొని 36 చానల్స్ నిర్వహిస్తుంది