
పట్నా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ కెసి సిన్హా (కుమ్రార్), మాజీ ఐపీఎస్ అధికారి ఆర్కే మిశ్రా (దర్భంగా), బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించిన డాక్టర్ అమిత్ కుమార్ దాస్ (ముజఫ్ఫర్పూర్) వంటి వారు అభ్యర్థులుగా ఉన్నారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి 16 శాతం ప్రాతినిధ్యం ఇచ్చిన ఈ జాబితా, పార్టీ వైవిధ్యతను చూపిస్తోంది.
నవంబర్ 6, 11 తేదాల్లో రెండు దశల్లో జరిగే ఎన్నికల్లో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ప్రశాంత్ కిషోర్ రాఘోపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సూచనలు ఇస్తున్నాడు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బలమైన పట్టానిస్తున్న ఈ స్థానానికి వ్యతిరేకంగా కిషోర్ అక్టోబర్ 11న ప్రచారం ప్రారంభించాడు. ఇప్పటివరకు జాబితాల్లో అతని పేరు లేకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.
మాజీ పోల్ స్ట్రాటజిస్ట్గా మోదీ, నితీష్ కుమార్, ఇతరులను గెలిపించిన కిషోర్, 2022లో జన్ సురాజ్ యాత్రతో బిహార్ ప్రజల మధ్య తిరిగాడు. ఈ పార్టీని 2024 అక్టోబర్లో ప్రకటించిన అతను, బిహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య త్రికోణ ఆటలో జన్ సురాజ్ కీలక ఫ్యాక్టర్ మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ 116 మంది అభ్యర్థులను ప్రకటించడం ద్వారా రాష్ట్రవ్యాప్త ప్రభావాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు