రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన చర్చలు రెండు దేశాల మధ్య ఆత్మీయ స్నేహాన్ని మరోసారి బయటపెట్టాయి. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని నూరు బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యం పెట్టుకున్నట్టు పుతిన్ ప్రకటించారు. చెల్లింపుల్లో జాతీయ కరెన్సీలు వినియోగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. భద్రత ఆర్థిక వాణిజ్య సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని మరింత లోతు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు పుతిన్ స్పష్టం చేశారు.

ఈ బలమైన బంధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సవాలుగా మారుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రష్యాపై ఆంక్షలు విధిస్తున్న అమెరికాకు భారత్ రష్యా స్నేహం కంటగింపుగా నిలుస్తోంది.ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించాలని రష్యా ఆశిస్తున్నట్టు పుతిన్ వెల్లడించారు. భారత్ కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో ఈ హామీ భారత్ కు ఎంతో ముఖ్యమైనది.

రష్యా నుంచి చమురు ఎరువులు వంటి కీలక వనరులు దిగుమతి చేసుకుంటున్న భారత్ కు ఈ స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది. మోదీ పుతిన్ మధ్య ఈ ఆత్మీయత రానున్న రోజుల్లో రెండు దేశాల సంబంధాలను మరింత దృఢంగా తీర్చిదిద్దుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మోదీ పుతిన్ భేటీ ద్వారా రెండు దేశాలు ప్రపంచ వేదికపై తమ స్వతంత్ర విధానాలను చాటి చెబుతున్నాయి. అమెరికా ఒత్తిడికి లొంగకుండా రష్యాతో స్నేహం కొనసాగించడం భారత్ విదేశీ విధానం బలాన్ని సూచిస్తుంది. ఈ సమావేశం రానున్న రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో మరిన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ పరిపాలనలో ఈ స్నేహం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: