నా సర్టిఫికెట్లు పోయాయి.. ఎవరికైనా దొరికితే ఈ అడ్రస్ కు పంపించండి.. అంటూ వచ్చే వాట్సప్ మెస్సేజులు చాలా చదివే ఉంటాం.. ఇక ముందు అలాంటి అవసరం ఉండదు. ఒరిస్సాలో ఇప్పటికే ఇలాంటి అవసరం లేదు. ఎందుకంటారా.. అక్కడి ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ కార్యక్రమం అమల్లోకి తెచ్చింది.

అంటే.. ఇక అక్కడ ఆదాయం, నివాసం లాంటి అధికారిక ధ్రువపత్రాలనుప్రజలకు ఉచితంగా అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ పథకం ప్రారంభించింది. దీని ద్వారా కుల, ఆదాయం, నివాసం లాంటి ప్రభుత్వ ధ్రువపత్రాల కోసం ప్రజలు ఆన్ లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నమూనా పరిపాలనలో భాగంగా.. ఈ పథకాన్ని ప్రవేశబెట్టామంటున్నారు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్.

దేశంలో ఈ తరహా విధానం ఇదే తొలిసారని పట్నాయక్వెల్లడించారు. ఈ సర్టిఫికేట్ పథకం ద్వారా 50లక్షలకు పైగా ప్రజలు లబ్దిపొందుతారని వివరించారు. ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా తగిన సమయంలో ప్రజలకు అందించే లక్ష్యంతోనే.. ఈ పథకం ప్రవేశపెట్టినట్టు నవీన్ పట్నాయక్ తెలిపారు. భూ లావాదేవీలను నిర్వహించడానికి పౌతీ అనే చెల్లింపు సేవల యాప్ ను కూడా నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: