నిరుద్యోగులకు హెచ్‌సీఎల్‌ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధిమైంది. గతేడాది కరోనా వైరస్‌ కారణంగా నియామకాలు అంతంత మాత్రమే చేపట్టిన సంస్థ వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో డిజిటల్ సేవలకు పెరుగుతున్న పోటీతో పాటుగా వేరే కంపెనీల తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల వచ్చే ఏడాదికి 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు.



ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈవో విజయ కుమార్‌ వెల్లడించారు. నోయిడా మెయిన్ బ్రాంచ్ గా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం 1,59,682 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత త్రైమాసికం లో మొత్తంగా 12,422 మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకుని నికరంగా 6,597 మంది తీసుకున్నది. ఇకపోతే కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ వారి  సంఖ్య 10.2 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. నైపుణ్యం కలిగిన మరో 20 వేల మందిని రిక్రూట్‌ చేసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్థిక ఫలితాల విడుదల చేసింది.



వీసాకు సంబంధించిన సమస్యలపై ఆయన స్పందిస్తూ.. అమెరికాలో విధులు నిర్వహిస్తున్న వారిలో 70% మంది అక్కడి స్థానికులేనని చెప్పారు. డిసెంబర్‌ తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.3,982 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయం లో ఆర్జించిన రూ.3,037 కోట్లతో పోలిస్తే ఈసారి లాభంతో 31.1 శాతం ఎక్కువ. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ సేవలకు డిమాండ్ పెరగడం కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో ఆదాయంలో వృద్ధి 2-3 శాతం మధ్యలో ఉంటుందని అంచనావేసింది.. ప్రస్తుతం ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: