ఉద్యోగులు వీటిని వినియోగించుకోక పోవడంతో ప్రభుత్వ విద్యపై ఇతరుల్లోనూ మంచి అభిప్రాయం ఉండటం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అట్టడడుగు కుటుంబాలు ఇబ్బందులను ఎదర్కొంటున్నారని వెల్లడించారు.1980లో యూకేలోనూ ఇలాంటి పరిస్థితే ఉండేదని, అక్కడ అమలు చేసిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని సర్కార్ గుర్తు చేసింది. అలాగే ఇటీవల ఢిల్లీ లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రవేశాలు పెరిగాయని తెలిపింది.
ఇలాంటి పరిస్థితే తెలంగాణలోనూ రావాలని, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను సర్కారు స్కూళ్లలోనే చదివించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటిదాకా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు ఏడాదికి ఇచ్చే ట్యూషన్ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.12వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశారు. దాన్ని పూర్తిగా తొలగించాలని పీఆర్సీ సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిస్తే ఏడాదికి రూ.2వేల రాయితీని వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న పథకాల కారణంగా చాలా మంది సర్కార్ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల వల్ల విద్యార్థులకు లభించే వాటి పై అధికారులు వారి తల్లి దండ్రులకు అవగాహన కల్పిస్తే ఈ ఏడాది సర్కారు పాఠశాలలో చేరిక పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..