మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన ఎక్కువగా పడాల్సి వస్తుంది. ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బారిన కూడా పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అదే విధంగా వాతావరణం మారినప్పుడల్లా దగ్గు, జలుబు ఇంకా కఫం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.చాలా మంది రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అలాగే జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల సప్లిమెంట్స్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఎలాంటి మందులు వాడే అవసరం లేకుండా కేవలం మన ఇంట్లో పదార్థాలతో ఒక చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇంకా కఫం వంటి సమస్యల నుండి కూడా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇక శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఈ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలి వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వాటిని బాగా వేడి చేయాలి.ఇక ఆ నీళ్లు వేడయ్యాక అందులో అర టీ స్పూన్ వాము ఇంకా పావు టీ స్పూన్ శొంఠి పొడి, చిటికెడు మిరియాల పొడి, అర టీ స్పూన్ బెల్లం తురుము అలాగే చిటికెడు నల్ల ఉప్పు లేదా సైంధవ లవణం వేసి బాగా కలపాలి.


ఇంకా అలాగే రెండు లవంగాలను మెత్తగా పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని అర గ్లాస్ కషాయం అయ్యే దాకా బాగా మరిగించి ఆ తరువాత ఈ డ్రింక్ ని వడకట్టుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని టీ తాగినట్టు చప్పరిస్తూ తాగాలి. మీ పిల్లలకు వయసును బట్టి అర కప్పు లేదా పావు కప్పు  ఇవ్వాలి. ఇలా ఉదయం పూట అల్పాహారం చేసిన గంట తరువాత లేదా భోజనం చేసిన గంట తరువాత దీన్ని తీసుకోవాలి. ఇలా మన ఇంట్లోనే డ్రింక్ తయారు చేసుకుని వాడడం వల్ల జలుబు, దగ్గు ఇంకా కఫం వంటి సమస్యలన్నీ ఈజీగా తగ్గుతాయి. అలాగే ఈ పానీయాన్ని రెండు రోజులకొకసారి తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఈ డ్రింక్ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. వైరస్ ఇంకా బ్యాక్టీరియాల వల్ల కలిగే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: