బ్లాక్ ఫంగస్.. ఇప్పడు కరోనా రోగులను భయపెడుతున్న కొత్త మహమ్మారి. కరోనా రోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ మాయ రోగం వస్తే.. మనిషి ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. చికిత్సలో భాగంగా కొన్ని భాగాలు తీసేయాల్సి వస్తుంది కూడా. ఒక వేళ బ్లాక్ ఫంగస్ వచ్చినట్టు నిర్థారణ అయితే ఒక ఇంజక్షన్ ద్వారా ఒక్క రోజులోనే చికిత్స సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు.


బ్లాక్ ఫంగస్‌కు ఎలా చికిత్స చేస్తారంటే.. ముందుగా వ్యాధి సోకిన భాగాన్ని గుర్తించి సీటీ స్కాన్‌ చేస్తారు. దీనిలో ఫంగస్‌ను గుర్తిస్తే ఎండోస్కోపీ ద్వారా శాంపిల్‌ సేకరిస్తారు. దాన్ని  మైక్రో బయోలజీ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఈ టెస్టులో పాజిటివ్‌ రిపో ర్ట్‌ వస్తే.. ఫంగస్‌ సోకిన భాగానికి ఆపరేషన్‌ చేసి ఫంగస్‌ను పూర్తిగా తొలగించేస్తారు. ఆపరేషన్‌ తర్వాత మళ్లీ ఇన్పెక్షన్‌ పెరగకుండా ఉండేందుకు యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్‌ ఇస్తారు.


అయితే.. ఈ వ్యాధికి రెండు రకాల ఇంజెక్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నా యి. డీఆక్సోలేట్‌, నెఫ్రో టాక్సిక్‌. ఈ రెండింటిలో నెఫ్రో టాక్సిక్ ఇంజెక్షన్‌ ధర రూ.25-50 వేల వరకు ఉంటుంది. దీన్ని ఉపయోగిస్తే ఒక్క రోజులో చికిత్స సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. కొవిడ్‌కు ముందు సాధారణంగా డయాబెటిక్‌ రోగులతోపాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ ఫంగస్‌ను గుర్తించేవారు.


ఈ బ్లాక్ ఫంగస్ కరోనా రోగులకే ఎందుకు వస్తుందంటే.. సాధారణంగానే కరోనా సోకిన సమయంలో రోగి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. డయాబెటిక్‌ రోగి అయితే షుగర్‌ లెవల్స్‌ భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్‌ మనిషిలోని రోగనిరోధక శక్తిని చంపేస్తుంటుంది. కరోనా సోకిన వ్యక్తుల్లో చాలామంది స్టెరాయిడ్స్‌ వినియోగిస్తుండటంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అందుకే వారికి బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతుంది. అందుకే కరోనా నుంచి కోలుకున్న డయాబెటక్‌ రోగులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: