
ఈ సమస్యకు సులభమైన పరిష్కారం మన ఇంట్లోనే దొరుకుతుందని కొంతమంది డాక్టర్లు సూచిస్తున్నారు. అదీ రాళ్ల ఉప్పు మరియు పసుపు. ఈ రెండు పదార్థాలు సహజసిద్ధమైన శుభ్రపరిచే గుణాలు కలిగి ఉంటాయి. రాళ్ల ఉప్పు గరుకుతనంతో సహజమైన స్క్రబ్బర్లా పనిచేస్తూ టాయిలెట్లోని కఠినమైన మరకలను తొలగిస్తుంది. పసుపు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల క్రిములను నాశనం చేస్తుంది.
విధానం సులభం: రాత్రి పడుకునే ముందు ఫ్లష్ చేసి, కొంచెం రాళ్ల ఉప్పు మరియు పసుపు వేసి అలాగే రాత్రంతా ఉంచాలి. నీలల్లో కూడా కలిపి వేయచ్చు. తెల్లారిన తర్వాత మరోసారి ఫ్లష్ చేస్తే, పేరుకుపోయిన మరకలు, దుర్వాసన, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా దీని వాడకానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.సోషల్ మీడియాలో ఈ టిప్ను చాలామంది ప్రయత్నించి మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొంతమంది డాక్టర్లు మరియు సోషల్ మీడియాలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చెప్పబడింది. దీన్ని అనుసరించాలా లేదా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం అని పాఠకులు గుర్తుంచుకోండి..!!