టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం రష్మిక మందన్న మంచి పేరుతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక అక్కడ మొదటగా కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా కన్నడలో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తరువాత ఆమెని తెలుగులో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో పరిచయం చేసాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. కాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అనంతరం విజయ్ దేవరకొండతో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీతా గోవిందం సినిమాలో కూడా నటించి దానితో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది రష్మిక.
ఇక ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవరు మూవీలో నటించి మరొక హిట్ కొట్టిన ఈ కన్నడ భామ, అనంతరం నితిన్, వెంకీ కుడుములు కాంబినేషన్లో తెరకెక్కిన భీష్మ మూవీతో కూడా విజయాన్ని అందుకుంది. ఆ విధంగా మంచి విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి, ఏకంగా సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు అతి త్వరలో నటించనున్న సినిమాల్లో ఆమె హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తోన్న మహేష్, దాని అనంతరం రాజమౌళి, త్రివిక్రమ్ లతో సినిమాలు చేయనున్నారు. కాగా త్రివిక్రమ్ తీయనున్న సినిమాలో రష్మికని హీరోయిన్ గా ఎంపిక చేశారట.

ఈ విషయమై ఆమెతో రెండు రోజుల క్రితం త్రివిక్రమ్ సంప్రదించినట్లు టాక్. అలానే ప్రస్తుతం వకీల్ సాబ్, క్రిష్ జాగర్లమూడి సినిమాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత హరీష్ శంకర్ తో ఒకటి అలానే సురేందర్ రెడ్డి తో మరొకటి సినిమాలు చేయనున్నారు .కాగా ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి తీయనున్న సినిమాలో హీరోయిన్ గా కొద్దిరోజుల క్రితం రష్మిక ని ఫైనల్ చేసారని అంటున్నారు. మొత్తంగా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఛాన్స్ దక్కించుకుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ సినిమాలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: