టాలీవుడ్లో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు.. అలాంటి వారిలో బొద్దుగుమ్మ సమీరా రెడ్డి కూడా ఒకరు.. ఈ భామ  చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.. ఎన్టీఆర్ తో'అశోక్', నరసింహుడు, ఇక మెగాస్టార్ చిరంజీవి తో'జై చిరంజీవ', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది సమీరా రెడ్డి.. ఆ తర్వాత తెలుగులో ఆమెకి ఆఫర్లు తగ్గిపోయాయి.. ఈ క్రమంలో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మించింది సమీరారెడ్డి.అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది సమీరా.ఇదిలా ఉంటే తాజగా తన సోషల్ మీడియాలో తన ఓ పాత ఫొటోని త్రో బ్యాక్ మెమోరీగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. అందులో తను చాలా లావుగా ఉంది..ఇక ఈ ఫోటోను చూసిన వారందరు  అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా?అంటూ చాలా ఆశ్చర్యపోతున్నారు..ఇక ఫోటోను షేర్ చేయడమే కాకుండా ఆ ఫొటో వెనుక ఉన్న కథని కూడా సమీరా రెడ్డి అభిమానులతో పంచుకుంది.. 

అప్పట్లో తాను చాలా లావుగా ఉండేదాన్నని, చాలామంది తనని సూటి పోటి మాటలతో బాధించేవాళ్లని, అలాంటివాటిని తట్టుకోవడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ఆమాటల్ని తట్టుకోలేకే..సన్నగా మారిందట. అలా.. మారడం వల్లే మోడలింగ్ లోకి అడుగుపెట్టగలిగానని అంటోంది. ఓ రకంగా నెగిటీవ్ కామెంట్లు కూడా మనకు మంచే చేస్తుంటాయి. దానికి నేనే పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.. ఇక ప్రస్తుతం సమీరా రెడ్డి షేర్ చేసినలేటెస్ట్ పిక్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: