ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు కొంతమంది హీరోయిన్లు వచ్చిన తక్కువ సమయంలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకుని బ్లాక్ బస్టర్  విజయాలను తమ ఖాతాలో వేసుకుని.. స్టార్ హీరోయిన్ గా మారిపోతున్నారు. ఇక మరికొంతమంది హీరోయిన్లు సినిమాలు చేస్తున్నప్పటికీ ఇక స్టార్ డమ్ సంపాదించడానికి మాత్రం ఎంతో కష్టపడుతున్నారు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా తెలుగు ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ కాలేకపోతున్నారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు నివేదా పేతురాజ్.



 ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించింది. టిక్ టిక్ టిక్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న  సినిమాలో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.  ఇలా ఇప్పటివరకు చాలానే సినిమాల్లో నటించినప్పటికీ సరైన క్రేజ్ మాత్రం సంపాదించుకోలేక పోయింది. ఇటీవల తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నివేద పేతురాజ్.



 తన కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా లుక్స్, ప్రవర్తన చూసి నాకు అన్ని సీరియస్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పటివరకు వచ్చిన పాత్రలన్నీ అలాంటివే వచ్చాయి అంటూ తెలిపింది. కానీ నిజంగా చెబుతున్నా నేను మాత్రం అలాంటి దాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడూ సరదాగా ఉంటానని సీరియస్గా ఉండను అని తెలిపింది. మరి ఈ అమ్మడు ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత  ఈ అమ్మడికి నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: