సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్లు .. తాము సంపాదించిన డబ్బు అంతటినీ.. వేస్ట్ కాకుండా ఉండేందుకు కొంతమందికి ఇంట్రెస్ట్ పరంగా ఇస్తూ.. కొన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తూ. ఉంటారు. అయితే మరి కొంత మందికి మాత్రం అధిక వడ్డీ ఆశ చూపిస్తూ హీరోయిన్లకు గాలం వేస్తూ ఉంటారు కొంతమంది ప్రముఖులు. అలాంటి ఆర్థిక మోసగాడు గా పేరు పొందారు సుకేష్ చంద్రశేఖర్. అయితే ఈయన బాలీవుడ్ నటులను మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు మీ చంద్రశేఖర్.. నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈయనతో కలిసి ఉండడం వల్ల చిక్కుల్లో పడ్డారు. అంతే కాకుండా రూ. 200 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు వినిపించాయి.

ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో ఉండే కొంతమందికి అత్యధిక ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈడీ విచారణ లో మాత్రం కార్లు, బంగారం వంటివి ఇచ్చినట్లుగా తెలియజేశారు. ఇక ఇదే కాకుండా మరికొన్ని కేసులపై కూడా సుఖేశ్ చంద్ర శేఖర్ ఆరోపణలు ఎదుర్కోవడంతో ఈయనను తీహార్ జైలు కి తరలించారు. ఇక అలా జైలులో ఉండగానే ప్రముఖ వ్యాపార వేత్త ను బెదిరించి కొన్ని కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్లో ఉండే హీరోయిన్ శ్రద్ధా కపూర్, అతని నుంచి డబ్బులు తీసుకున్నది అనే వార్త కూడా తెలియజేసినట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా 2015 సంవత్సరంలో NCB కేసు నుంచి సహాయం చేశారని తెలియజేశారట సుఖేశ్ చంద్ర శేఖర్.ఇక శిల్పా శెట్టి తో కూడా పరిచయం ఉందని అధికారులకు తెలియజేశారు చంద్రశేఖర్. శిల్పాశెట్టి భర్త జైల్లో ఉన్నప్పుడు బెయిల్ విషయాన్ని కూడా తనతో చర్చించామని చెప్పుకు వచ్చారట.జాక్వలిన్ తన ప్రియురాలి అని చెప్పుకొచ్చారు చంద్రశేఖర్. కేవలం ఆమె కోరడంతో నే 500 కోట్ల రూపాయలతో లేడి ఓరియెంటెడ్ మూవీలను తీయబోతున్నాడని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: