అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. అఆ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కేరళ బ్యూటీ 

తన అందం మరియు అభినయంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఎక్స్ పోజింగ్ లేకుండానే చాలా మంది ఫ్యాన్స్‌ను ఆమె సంపాదించుకుంది. మొదటి చిత్రంతోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రేమమ్‌ మరియు శతమానం భవతి వంటి మూవీస్‌లో యాక్ట్ చేసి తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. గొడవలకు, వివాదాలకు దాదాపుగా దూరంగా ఉండే ఈ భామ మాత్రం సీనియర్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ తో గొడవ పెట్టుకుందట.

2018లో వీరిద్దరి కాంబినేషన్‌లో హలోగురు ప్రేమకోసమే అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో వచ్చింది. కానీ ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందట.ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ చిన్న విషయంలో వీరిద్దరి మధ్య గొడవ వచ్చిందని దీంతో సహనం కోల్పోయిన ప్రకాశ్ రాజ్.. అందరి ముందే ఆమెపై గట్టిగా అరిచాడట.. దీంతో ఆమె విసుగు చెంది షూటింగ్‌కు రెండు రోజుల పాటు రాలేదని సమాచారం.


సినిమా నుంచి పూర్తిగా తప్పుకోవాలని డిసైడ్ కూడా అయిందట. తర్వాత హీరో మరియు డైరెక్టర్ ఆమెకు నచ్చజెప్పి మూవీ కంప్లీట్ చేశారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందనేది మాత్రం తెలియాలి. కాగ ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో 18 పేజెస్ మరియు కార్తికేయ2 వంటి మూవీస్ లో యాక్ట్ చేస్తోంది. ఈ రెండు మూవీస్ షూటింగ్ కూడా మొదలైంది. ఇదిలా ఉండగా 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్‌లో ఓ మాస్ హిట్ గా నిలిచిపోయిందని అందరికి తెలుసు.ఈ మూవీ పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీలో రామ్ మాస్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: