ప్రస్తుతం ఒక వారం నుండి టాలీవుడ్ లో ఒకే సినిమా చుట్టూ కథలు తిరుగుతున్నాయి. ఈ నెల 29 న థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల అవుతున్న ఆచార్య మూవీ కోసం ఒకవైపు ఫ్యాన్స్ మరో వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ గా చిరంజీవి తానేంటో నిరూపించుకుని వయసు దాటుతున్నా ఇంకా అదే హుషారుతో సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. మొదట ఈ సినిమాను చిరంజీవితో అనుకుని ఆ తర్వాత కథ నచ్చడంతో మల్టీ స్టారర్ గా మారిపోయింది. అది కూడా తండ్రి కొడుకులు ఒకే సినిమాలో చేస్తుండడం ఫ్యాన్స్ కు ఒక పండుగ లాంటి వార్త అని చెప్పాలి.

ఇందులో రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించాడు. ఈ అనుభవాలను మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరితో పంచుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా ఏదో ఒక విషయం మీద వార్తల్లో ఉంటోంది. తాజాగా ఈ సినిమాను మిస్ చేసుకున్నానని ప్రముఖ నటుడు తన నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. మరి ఆ నటుడు ఎవరు ? ఎందుకు ఈ సినిమాలో అవకాశం మిస్ చేసుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం.

టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ గా పేరున్న సాయి కుమార్ సోదరుడు అయ్యప్ప శర్మ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కెజిఎఫ్ సినిమాలో చేసిన పాత్ర మూలంగా అందరికీ ఇప్పుడు తెలిసిన వ్యక్తి అయిపోయాడు. అయితే తాజాగా ఇతను ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆచార్య సినిమాను మిస్ చేసుకున్న విషయాన్ని తెలియచేశాడు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఇతన్ని కాంటాక్ట్ చేశారట ఆచార్య టీమ్... అయితే ఆ సమయంలో అయ్యప్ప శర్మ వేరే సినిమా షూటింగ్ లో మారుమూల ప్రాంతంలో ఉండడంతో ఫోన్ పనిచేయలేదు.. మెస్సేజ్ కూడా ఎప్పుడో రావడంతో ఈ సినిమా అవకాశాన్ని మిస్ అయ్యాడు. ఈ విషయాన్ని ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకుని నిరాశ పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: