టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ కి తొలిసారిగా కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో తీసినా ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన నటి సమంత రూత్ ప్రభు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఘట్టమనేని ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో జెస్సీ పాత్రలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ మనసు దోచిన సమంతమూవీ ద్వారా పెద్ద విజయం అందుకున్నారు.

నాగ చైతన్య హీరోగా చేసిన ఆ సినిమాకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఇక  ఆ తరువాత నుండి పలువురు టాలీవుడ్ స్టార్ నటుల సరసరణ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుని వచ్చిన ఛాన్స్ లను మంచి సక్సెస్ లుగా మలుచుకున్న సమంత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా మంచి ఛాన్స్ లతో దూసుకెళ్లారు. ఇక తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో దాదాపుగా చాలా సినిమాలు పెద్ద సక్సెస్ లు అందుకోవడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనే పేరు కూడా ఉంది. ఇక ఇటీవల వివాహానంతరం తన భర్త నాగ చైతన్య నుండి కొన్ని కారణాల రీత్యా విడిపోయిన సమంత ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు.

అయితే విషయం ఏమిటంటే, విడాకుల సమయంలో ఇటీవల ఒకింత మనోవేదన అనుభవించిన తనకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో బాసటగా నిలిచి మనోధైర్యాన్ని అందించారని, ఇక ఇటీవల పూర్తిగా ఆ డిప్రెషన్ నుండి పూర్తిగా బయటకు వచ్చిన తాను ఇకపై పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టినట్లు ఇటీవల సమంత మాట్లాడుతూ చెప్పారు. కాగా ఆమె ప్రస్తుతం గుణశేఖర్ తో శాకుంతలం , అలానే యశోద అనే పాన్ ఇండియా మూవీతో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి, వీటితో పాటు ఒక హాలీవుడ్ మూవీ కూడా చేస్తున్నారు సమంత. మొత్తంగా ఈ లైనప్ ని బట్టి చూస్తే అతి త్వరలో బాక్సాఫీస్ పై సమంత బ్యాటింగ్ షురూ ఖాయం అని తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమాలతో సమంత ఎంత మేర విజయాలు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: