మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఆచార్య సినిమా మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా నిరుత్సాహపరిచింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరస పెట్టి మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే .

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తేరకేక్కుతున్న ఒక మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు బాబి గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించినటు వంటి గ్యాంగ్ లీడర్ , ముఠామేస్త్రి మూవీ ల శైలిలో అదిరిపోయే మాస్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 వ మూవీ గా తిరకేకుతూ ఉండడంతో ఈ మూవీ ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది.

మూవీ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ చివరి షెడ్యూల్లో రవితేజ కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: