తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ యువ నటుడు పిల్ల నువ్వు లేని జీవితం అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ లో సాయి తేజ్ తన నటనతో ... డాన్స్ తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించిన సాయి తేజ్ ఎన్నో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా సాయి తేజ్ "విరూపాక్ష" మూవీ లో హీరో గా నటించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. గతంలో కార్తీక్ దండు దర్శకుడు సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేశాడు. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 21వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయిన విరూపాక్ష మూవీ మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ప్రస్తుతం వసూలు చేస్తుంది.

 దీనితో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ ఈవెంట్ కు మారుతి విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో భాగంగా మారుతి మాట్లాడుతూ ... దర్శకుడు సుకుమార్ గారు టాలెంటెడ్ డైరెక్టర్ లని సినీ పరిశ్రమ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.  అలా తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థాయిని నెలకొల్పారు అని మారుతి అన్నారు. దర్శకుడు కార్తీక్ ప్రెజెంటేషన్ స్కిల్స్‌ని మారుతి ఆకాశానికి ఎత్తేశాడు. ఈ రోజుల్లో సాంకేతికంగా మంచి మూవీ లను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని ... అలాంటి మూవీ లలో విరూపాక్ష కూడా ఒకటని మారుతి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: