సాధారణంగా చాలా మంది డబ్బులు అధిక మొత్తంలో పొందాలి అంటే, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులు ప్రవేశపెట్టిన పథకాలలో డబ్బు లు దాచేయాలని చూస్తూ ఉంటారు.. మరి కొంతమంది డబ్బులను బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వదిలేస్తే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు.. ఇలా చేసేముందు ఒకసారి ఈ విషయాలను కూడా తెలుసుకోండి..
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు సంస్థలు అత్యధిక రాబడిని అందిస్తున్నాయి.. తమిళనాడు ట్రాన్స్ పోర్ట్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో పాటు తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అనేవి ఈ రెండు సంస్థలు.. వీటిలో డబ్బులు డిపాజిట్ చేయడం వల్ల 8.5 శాతం వరకు మనకు వడ్డీ కూడా లభిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు గా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5 శాతం వరకు మాత్రమే మనకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.
కాకపోతే మీరు ఎంచుకునే ప్రాతిపదికన వడ్డీ మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. మీరు కావాలంటే ప్రతినెలా వడ్డీని పొందవచ్చు లేదా ఒకేసారి మెచ్యూరిటీ సమయంలో అసలు తోపాటు వడ్డీని కూడా కలిపి తీసుకోవచ్చు.. పూర్తి వివరాల కోసం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.