ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం అనేది ఎంతో అత్యవసరమైన పని అని చెప్పాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో చెప్పడం అసాధ్యం కాబట్టి ఇప్పటినుంచే డబ్బు ఆదా చేయడం నేర్చుకుంటే.. తప్పకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా భవిష్యత్తులో సంతోషంగా జీవించగలుగుతాము. మరీ ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ కలిసి పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లయిన వారికి ఇప్పుడు కొత్త కొత్త పథకాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో అందులో కొన్ని పథకాలు ఎటువంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయాన్ని కూడా అందిస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటి. 2019 నుంచి ఈ పథకం అందుబాటులో ఉండగా భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకంలో చేరి నెలకు రూ .200 కడితే చాలు ఏడాదికి రూ.75,000 మీ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా పలు రకాల పనులు చేసుకునే వారు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.ఇక నెలవారీ ఆదాయం రూ .15 వేలకు మించి ఉండకుండా ఉంటే ఎవరైనా సరే ఈ పథకంలో చేరి ఆదాయాన్ని పొందవచ్చు.

ఉదాహరణకు 30 సంవత్సరాల మీకుంటే ఈ పథకంలో చేరితే నెలకు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇలా 60 సంవత్సరాల వరకు ఇద్దరూ భార్యాభర్తలు నెలకు 200 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇలా ఇద్దరూ చేరితే ఏడాదికి 72 వేల రూపాయలను బ్యాంక్ అకౌంట్ నేరుగా మీ ఖాతాలోకి వేస్తుంది. మీరు కావాలంటే ప్రతి నెల కొంత మొత్తంలో పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఇకపోతే ఇందులో ఖాతా తెరవడానికి బ్యాంక్ అకౌంట్, మొబైల్ ఫోను, ఆధార్ కార్డు ఉన్నవారు దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. అంతేకాదు ఇక్కడ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: