నందమూరి నట సింహం బాలకృష్ణ తన వందో సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం చరిత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటిదాకా మొరాకొలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన చిత్రయూనిట్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత హైదరబాద్ చిలుకూరు బాలాజి టెంపుల్ సమీపంలో షూటింగ్ జరుపుకుంటున్నారు.


భారీ యుద్ధ సన్నివేశాలతో కూడినా ఈ ఎపిసోడ్ లో బాలయ్య గుర్రం మీద నుండి కింద పడ్డట్టు సమాచారం. అయితే చిన్నపాటి గాయాలే తప్ప ప్యాక్చర్లు ఏమి కాలేదట.. బాలయ్య గుర్రంపై స్వారి చేస్తూ ఫైట్ చేస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగిందట. బాలయ్య వందో సినిమా తెలుగు ప్రేక్షకులకు అంకితమిస్తూ తన అభిమానుల కోసం చరిత్రలో మిగిలిపోయేలా సినిమా చేస్తున్నారు.   


శాతకర్ణి ప్రారంభోత్సవం నాడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ :  


సినిమాకు కావాల్సినంత కష్ట తను పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ గా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్ కూడా 8 కోట్లతో ఏర్పరచిన భారీ షిప్ లో జరుగుతుందట. ఇక ఈ సినిమాలో శాతకర్ణి జోడిగా రాణి పాత్రలో సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.


క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వై.సాయి బాబు, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ పెట్టిన నాటి నుండి సినిమా మీద ఎన్నో ఆశలతో ఉన్నారు నందమూరి అభిమానులు. ఇక బాలయ్య ఇష్టపడి మరి కష్టంతో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: