టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేర అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ధనుష్ హీరో గా నటిస్తూ ఉండగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతోం ది. 

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ ను మే 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో మొత్తం 500 నోట్ల రూపాయల కట్టలు ఉన్నాయి. దానితో ఈ టీజర్ లో కూడా డబ్బుకు సంబంధించిన అంశం ముడిపడి ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది. ఇకపోతే ఈ సినిమా టీజర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ టీజర్ కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: