తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  అయితే ఈగ తర్వాత ఆయన మరో అద్భుత సృష్టి ‘బాహుబలి, బాహుబలి 2’. ఈ చిత్రం జాతీయ స్థాయిలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది.  తాజాగా రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

ఇటీవల ఈ చిత్రం గురించి ప్రెస్ మీట్ లో ఎన్నో వివరాలు అందించారు రాజమౌళి.  బాహుబాషా చిత్రం కావడంతో అన్ని ఇండస్ట్రీల్లో నుంచి నటీనటులను తీసుకుంటున్నారు రాజమౌళి.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి అలియా భట్, అజయ్ దేవగాన్ ని తీసుకున్నారు.  రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తున్న విషయం తెసిందే.  ఈ చిత్రంలో నటించడానికి అలియా భట్ అక్షరాలా 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. 

అలియా భట్ కి సంబంధించిన టీమ్ ఖర్చులు .. స్టార్ హోటల్లో బస ఖర్చులు .. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కాకుండా ఆమె పారితోషికాన్ని 5 కోట్లుగా ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు.  దక్షిణాధి సినీ హీరోయిన్లకు ఇంత పెద్ద పారితోషికం ఇప్పటి వరకు అందలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: