తెలుగు ఇండస్ట్రీలో దువ్వాడ జగన్నాథం చిత్రంలో ఒక్కసారే స్టార్ హీరోయిన్ గా మారింది బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే. వాస్తవానికి ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించినా.. ఈ అమ్మడికి దువ్వాడ జగన్నాథంతోనే బాగా కలిసి వచ్చింది.  ఈ మూవీలో బికినీతో కుర్రాళ్ల మనసు దోచింది.  ఆ తర్వాత స్టార్ హీరోలతో వరుసగా విజయాలు అందుకుంటుంది. ముకుంద సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదట్లో ఆఫర్ల కోసం సతమతమైనా ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకుంది.   ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో ’ లో నటించింది. 

 

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీలో ఇది చేరింది.  అంతే కాదు ఇప్పుడు ప్రభాస్ సరసన మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది.  తాాజాగా బాలీవుడ్ దర్శకుడు ఫర్హాదా సంజీ తెరెకెక్కిస్తున్న "కభి ఈద్ కభి దివాళి'' చిత్రంలో సల్మాన్‌ సరసన నటించేందుకు పూజా ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ మూవీలో నటిస్తుంది.  ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగ చైతన్య, వరుణ్ తేజ్ సరసన నటించిన ఈ అమ్మడు త్వరలో పవన్ తో కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ లవ్ స్టోరిలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. 

 

ప్రభాస్ సరసన పూజా హెగ్డే మంచి విజయం అందుకుంటే మాత్రం కొంత కాలం వరకు స్టార్ హీరోయిన్ హోదా ఉంటుందని అంటున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రోమ్‌లో జరుగుతోంది. కాగా షూటింగ్‌కు హాజరైన పూజా హెగ్డే కరోనా టెన్షన్‌తో ముఖానికి మాస్క్‌ ధరించి చేతులకు గ్లౌస్‌లతో ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్‌,  యూవీ క్రియేషన్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: