ప్రముఖ సింగర్ కనికా కపూర్ కి కరోనా పాజిటీవ్ అని తేలడంతో అప్పటి నుంచి బాలీవుడ్ లో టాక్ ఆప్ ది టౌన్ గా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఆమెకు పలుమార్లు కరోనా పాజీటీవ్ అని తేలడంతో అందరూ షాక్ తిన్నారు. కరోనాకు సంబంధించి తనపై చాలా ఆరోపణలు వచ్చాయని, వాటిలో తన తప్పేమి లేదని అంటోంది కనికా కపూర్. లండన్ నుంచి తిరిగి వచ్చాక తనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, దీంతో అందరితో సాధారణంగా మెలిగానని చెప్పింది. అయితే లక్నోలో తను గ్రాండ్ పార్టీ ఏర్పాటుచేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఓ స్నేహితుడు ఏర్పాటు చేసిన పార్టీకి తాను హజరైనట్లు స్పష్టం చేసింది.
యూకే, ముంబై, లక్నోల్లో నేను కలిసిన వ్యక్తుల్లో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. నాకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత వారికి పరీక్షలు చేయిస్తే నెగిటివ్ అని తేలింది. ఇన్నాళ్లూ నేను నోరు మెదపకుండా వున్నది నేను తప్పు చేశానని కాదు, అంతా తెలిసి కూడా అపార్థాలు చోటుచేసుకున్నాయని, సమాచార మార్పిడిలో లోపం వుందని భావించడం వల్లే తనను చాలా మంది అపార్థం చేసుకున్నారని అన్నారు.. ఏదో ఒక రోజు అసలు విషయం బయటకు వస్తుందనే భావించానని, తనపై అసత్యాలు ప్రచారం చేసిన వాళ్లు పశ్చాత్తాప పడి తీరుతారని పేర్కొంది. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకుని లక్నోలోని తన కుటుంబ సభ్యులతో క్వారంటైన్ ను కొనసాగిస్తూ సోషల్ మాద్యంలో పోస్ట్ చేసింది.
తాను ఇంతకాలం ఎంతో ఓపిక పట్టానని తమ తప్పు వారు తెలుసుకుంటాని అన్నారు. కాగా, ఈ కష్టకాలంలో తనకెంతో అండగా నిలిచిన కుటుంబసభ్యులు, స్నేహితులకి ధన్యవాదాలు అంటూ సోషల్ మాద్యంలో పోస్టో చేసింది. కాగా విదేశాల నుంచి వచ్చి విషయం దాచిపెట్టి పలు కార్యక్రమాలకు హజరైన కనికా కపూర్పై సెక్షన్ 269, 270 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.