ప్రస్తుతం సినిమాల ప్రభావం తగ్గి ఆన్లైన్ లో వచ్చే వెబ్ సిరీస్ లు చూసే పరిస్థితి ఏర్పడింది. దీని కోసం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్, ఆహా ఇలా అనేక OTT ప్లాట్ ఫార్మ్స్ వచ్చేసాయి. కొన్ని సినిమాలు సినిమా థియేటర్ లో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే... ఈమధ్య అల్లు అర్జున్ విడుదల చేసిన ఆహా యాప్ లో మొదటి వెబ్ సిరీస్ గా మస్తీ ని మొదలు పెట్టింది. అయితే ఇందులో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న చాందినీ చౌదరి తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. అయితే సినిమాల్లో అంత పెద్దగా పనిచేయకపోవడంతో ఆమె మళ్ళీ వెబ్ సిరీస్ లపై గాలి మళ్ళింది. 

 

ఇక ఇదే అదనుగా ఆహా యాప్ లో వచ్చే మస్తీ వెబ్ సిరీస్ లో నవదీప్, హెబ్బా పటేల్, చాందినీ చౌదరి నటిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ని దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో పెళ్లైన నవదీప్ చాందిని చౌదరి తో అఫైర్ పెట్టుకుంటాడు. నిజంగా ఈ ట్రైలర్ లోనే నవదీప్, చాందిని చౌదరి తో లిప్ లాక్ సీన్ ఉంటుంది. నిజానికి అది చూసిన తెలుగు ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే నవదీప్ చాలా వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ మస్తీ లో తన మార్కును చూపిస్తున్నాడని అనుకోవచ్చు.

 


ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్, చాందిని తోపాటు అక్షరా గుడా, బిందుమాధవి కూడా ఇందులో నటిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ యాప్ విడుదల చేసేటప్పుడు టాలెంట్ ఉన్నవారికి ఈ యాప్ ఎప్పటికి ఆహ్వానం పలుకుతుంది అని అల్లు అరవింద్ చెప్పారు. అయితే ఈ మధ్య " కుదురుగా నిలవని " అనే పాటతో ఈ వెబ్ సిరీస్ ఇంకా మంచి క్రేజ్ సంపాదించింది అని చెప్పుకోవచ్చు. ఇందులో బిందు మాధవి తన భార్యగా నటిస్తూ ఏదో బాధలో ఉన్నట్లు ఈ పాటను చిత్రీకరించడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: