ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త టాలెంట్ కి కొదవ లేదు. ఎప్పటికప్పుడు పరిశ్రమలో కొత్తవాళ్లు పుట్టుకొస్తున్నారు. ఇక ముఖ్యంగా మ్యాటర్ ఉన్న డైరెక్టర్స్ పరిశ్రమలో రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అందుకే స్టార్ హీరోలు కూడా స్టార్ డైరెక్టర్స్ కోసం ఎదురు చూడకుండా.. విషయం ఉందనుకుంటే.. కొత్త కుర్రాళ్ళతో కూడా సినిమాలు చేసుకంటూ ముందుకు పోతున్నారు. ఈ తరుణంలోనే మహేష్, పరుశురామ్ తో సినిమా చేస్తున్నాడు. దాంతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి కూడా వంశీ పైడిపల్లి వంటి దర్శకులు మరో సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది.

అయితే తమ కథకు తగ్గ స్టార్ హీరో దొరకక, చిన్న హీరోలతో సినిమాలు చేయలేక టైమ్ పాస్ చేస్తూ అల ఖాళీగా ఉండిపోతున్నారు చాలామంది. ప్రస్తుతం ఈ కోవలోకే వస్తాడు ప్రముఖ దర్శకుడు మారుతీ. తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎంటర్టైనింగ్ దర్శకుడిగా మారుతీ మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. మారుతి హిట్స్ కొట్టి కూడా సరైన హీరోని పట్టలేక గోపీచంద్ లాంటి ప్లాప్ లో ఉన్న హీరోతో సినిమా చేసుకోవాల్సి వస్తోంది. లేకపోతే ప్రతిరోజూ పండగే మూవీతో మారుతీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించినా.. ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదనే చెప్పాలి మరి.

ఇక సాయి ధరమ్ సినీ జీవితంలోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన సినిమా ప్రతిరోజూ పండగే. అలాంటి సినిమా తరువాత మారుతి పెద్ద హీరో కోసం ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. దీంతో విసిగిపోయి గోపిచంద్ తో సినిమా ఒప్పుకున్నాడు. నిజానికి ఈ మూవీ సక్సెస్ తరువాత ఏకంగా అల్లు అర్జున్ తో మూవీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు మారుతీ. మెగా కాంపౌండ్ తో మంచి అనుబంధం ఉన్నా.. ఎందుకో ఆ ప్రయత్నాలు ఏవి కలిసిరాలేదు. స్టార్ హీరోతో మూవీ చేసి.. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లాలన్న మారుతీ కోరిక మాత్రం ఇప్పట్లో తీరేలా కనబడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: