నితిన్ హీరోగా నటిస్తున్న రంగ్ దే సినిమా మార్చి 26వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా ని బాగా ప్రమోట్ చేస్తోంది. రంగ్ దే నిర్మాత అయిన సూర్యదేవర నాగ వంశీ కూడా చురుకుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగ వంశీ రంగ్ దే సినిమా పై వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు. రంగ్ దే సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుందని.. ఆ ట్విస్ట్ "నువ్వే కావాలి" చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. నువ్వే కావాలి సినిమా కి, నితిన్ సినిమా కి ఎలాంటి సంబంధం లేదని.. నితిన్ నటించిన రంగ్ దే సినిమాలోని ట్విస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. ఇప్పటివరకూ అలాంటి ట్విస్ట్ తో ఏ సినిమా రాలేదని నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.


ఇటీవల విడుదలైన ట్రయిలర్ రంగ్ దే సినిమాపై అంచనాలను పెంచేసింది. కీర్తి సురేష్, నితిన్ మధ్య సాగే రొమాంటిక్ డ్రామా చూడ ముచ్చటగా అనిపించింది. వీళ్లిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ సినిమాని చాలా తెలివిగా ప్రచారం చేసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన ఫన్నీ వీడియోలని ప్రతి రోజు కీర్తి సురేష్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా లో నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తుండగా.. కామెడీకి కొరత ఉండదని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.


ఇటీవలే వచ్చిన చెక్ సినిమా ఫెయిల్ అవడంతో నితిన్ తీవ్ర నిరాశలో మునిగి తేలుతున్నారు. రంగ్ దే సినిమా అయినా తనకు మంచి హిట్ ఇస్తుందని కొండంత ఆశతో వేచి చూస్తున్నారు. మరి ప్రేక్షకులు నితిన్ సినిమాకి ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి. నితిన్ బాలీవుడ్ మూవీ అంధధున్‌కు తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: